అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకుడు. గతచిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ని చిత్ర బృందం విడుదల చేసింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అఖిల్ ఇందులో కనిపిస్తున్నాడు. ఓ రొమాంటిక్ లవ్స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్లో హీరో అఖిల్ గాయపడినట్టు తెలిసింది. గురువారం ఉదయం షూటింగ్ చేస్తుండగా అఖిల్ గాయపడ్డారని, అతని రైట్ హ్యాంగ్ ఎల్బో స్థానంలో గాయం అయిందని. దీంతో చిత్ర బృదం షూటింగ్ ఆపేసిందని తాజా న్యూస్.
వారం పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతం అఖిల్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని, ఈ నెల 10 వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారని. ఆ తరువాతే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని చిత్ర వర్గాల ద్వారా తెలిసింది.