ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిప్పులు చెరిగాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . నిన్న జనసేన ఆధ్వర్యంలో ధవలేశ్వరంలో నిర్వహించిన భారీ కవాతులో చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్ . 2014 ఎన్నికల్లో మాకు సత్తా లేక కాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవమున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీకు మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక మా అభిప్రాయాలు తీసుకున్నారా ? అధికారం కట్టబెడితే మీరు చేసిన అభివృద్ధి ఏది ? ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది , కనీసం పంచాయితీ సర్పంచ్ గా ఎన్నిక కాలేని లోకేష్ ని ఏకంగా పంచాయతీరాజ్ సఖా మంత్రిగా ఎలా నియమిస్తారు అంటూ చంద్రబాబు పై నిప్పుల వర్షం కురిపించాడు .
అంతేనా పనిలో పనిగా ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ని కూడా ఏకి పారేసాడు పవన్ . ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జగన్ పాత్ర శున్యమని ఆ పని జనసేన చేసిందని జగన్ వైఖరిని దుయ్యబట్టాడు అంతేకాదు ఫ్యాక్షన్ రాజకీయాలను గోదావరి జిల్లాలలోకి తీసుకురావాలని చూస్తే తన్ని తరిమేస్తానని , గోదావరిలో కలిపేస్తా నని జగన్ కు కూడా వార్నింగ్ ఇచ్చాడు పవన్ . ఇక ఏతా వాతా చెప్పేదేమంటే ….. వచ్చే ఎన్నికల్లో నన్ను ముఖ్యమంత్రి ని చేయండి జనరజకమైన జనసేన పాలన అందిస్తానని . మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో 2019 వేసవిలో తేలనుంది .
English Title: Pawan kalyan fires on chandrababu