పవన్ కళ్యాణ్ అభిమానులు నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కర్నూల్ జిల్లా డోన్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి . నిన్న పవన్ కళ్యాణ్ అనంతపురం లో జనసేన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే . కాగా ఆ కవాతులో పాల్గొనడానికి కర్నూల్ జిల్లా డోన్ కి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు కారులో అనంతపురం బయలుదేరారు . అనంతపురం లో జరిగిన కవాతులో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో డోన్ సమీపంలో భారీ యాక్సిడెంట్ జరిగింది . హైదరాబాద్ నుండి వేగంగా వస్తున్న బస్సు డీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు .
కారులోనే మృతదేహాలు పడిఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం . జనసేన కవాతు కి వెళ్లి వస్తూ నలుగురు అభిమానులు మృత్యువాత పడటంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి . ఇక ఆ నాలుగు కుటుంబాల రోదన వర్ణనాతీతం .
English Title: Pawan Kalyan fans died in car accident