Homeట్రేడ్ న్యూస్కరీంనగర్ మమతా థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ ఆందోళన

కరీంనగర్ మమతా థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ ఆందోళన

పవర్ స్టార్ తన పవర్ ను చూపేందుకు భీమ్లా నాయక్ గా థియేటర్స్ లోకి వచ్చేసాడు. వారం రోజులుగా అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 25 వ డేట్ వస్తుందా..ఎప్పుడెప్పుడు తమ దేవుడ్ని తెరపై చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఏపీ మినహా అన్ని చోట్ల ఇప్పటికే బెనిఫిట్ షోస్ మొదలవ్వగా..తెలంగాణలోని కరీంనగర్ మమతా థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా బెన్‌ఫిట్‌ షో టికెట్స్‌ అభిమానులమైన మాకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇస్తే ..నిబంధనలకు విరుద్దంగా ఆరు షోలు ప్రదర్శించేందుకు టికెట్లు అమ్ముకున్నారని థియేటర్ యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. అభిమానుల ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడం తో..రంగంలోకి దిగిన పోలీసులు థియేటర్‌ దగ్గర ఆందోళన చేస్తున్న అభిమానుల్ని చెదరగొట్టారు. మరోపక్క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు ఎక్కడ తగ్గడలేదని , నటనలో కుమ్మేశారని అంటున్నారు. ఇక థమన్ మ్యూజిక్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి కానీ చెప్పాల్సిన పనిలేదు. థియేటర్స్ లలో స్పీకర్లు పగిలిపోవాల్సిందే అని చెపుతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సూపర్బ్ అని , సాగర్ డైరెక్షన్ కేక పుట్టించిందని , ఇక ఎక్సలెంట్ క్లయిమాక్స్.. ఇలా అన్ని అంశాలు హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు. మరికొంతమంది ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉందని అంటున్నారు. ఇక క్లయిమాక్స్ ఫైట్ కు అయితే ఫ్యాన్స్ విజిల్స్ వేయడం కాయమని, ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఇద్దరు హీరోలు చాలా ఈక్వల్ గా నటించినట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అని, రికార్డ్స్ రాసుకోవడమే అని చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All