Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ , పవన్ ల తప్పుని ఎత్తి చూపిన పరుచూరి

త్రివిక్రమ్ , పవన్ ల తప్పుని ఎత్తి చూపిన పరుచూరి

paruchuri gopalakrishna comments on agnathavasi failureఅజ్ఞాతవాసి చిత్రం ఎందుకు ప్లాప్ అయ్యిందో వివరించి మరీ చెబుతున్నాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ . ఈ ఏడాది జనవరిలో విడుదల అయిన అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . బయ్యర్లు అంతా దాదాపుగా రోడ్డున పడ్డారు ఈ సినిమాని భారీ రేట్ల కు కొని , ఇక్కడ రెండు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం ఘోర పరాజయం పొందింది దాంతో లబోదిబో మన్నారు అజ్ఞాతవాసి బయ్యర్లు . పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ అజ్ఞాతవాసి చిత్రం ని ఎక్కువ రేటు కి కొన్నారు .

ఇక సినిమా పరాజయానికి కారణం వివరించాడు పరుచూరి గోపాలకృష్ణ . ఇంతకీ పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన కారణం ఏంటో తెలుసా …… సోదరుడి ని , అలాగే తండ్రి ని చంపేస్తే పగ , ప్రతీకారం తీర్చుకోవాల్సింది పోయి హీరోయిన్ ల వెంట పడుతూ ప్రేమ గీమా అంటూ ఎంటర్ టైన్ అవ్వడమే అసలు కారణమని అలా కాకుండా పగ , ప్రతీకారం అంటూ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అయ్యుండేదని ……. అలా త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ కు ఎవరూ చెప్పలేదు కాబట్టే ఇలా డిజాస్టర్ అయ్యిందని దానికి మరో ఉదాహరణ కూడా చెప్పాడు . ధ్రువనక్షత్రం అనే సినిమాలో తల్లి మంచాన పడి ఉన్నప్పుడు హీరో వెంకటేష్ హీరోయిన్ తో డ్యూయెట్ పాడుకుంటాడని , కానీ ఈ విషయం నిర్మాత రామానాయుడు కు చెబితే మమ్మల్ని తిట్టాడని తల్లి మంచాన పడితే హీరో బాధపడకుండా డ్యూయెట్ పాడటం ఏంటని ప్రశ్నించాడని అందుకే మార్చామని సెలవిచ్చాడు పరుచూరి . నిజమే అజ్ఞాతవాసి స్క్రీన్ ప్లే మరోలా ఉంటే తప్పకుండా హిట్ అయ్యుండేది .

- Advertisement -

English Title: paruchuri gopalakrishna comments on agnathavasi failure

paruchuri gopalakrishna comments on agnathavasi failure

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All