Homeటాప్ స్టోరీస్పంచతంత్రాన్ని తిరిగి మొదలుపెట్టిన కలర్స్ స్వాతి

పంచతంత్రాన్ని తిరిగి మొదలుపెట్టిన కలర్స్ స్వాతి

పంచతంత్రాన్ని తిరిగి మొదలుపెట్టిన కలర్స్ స్వాతి
పంచతంత్రాన్ని తిరిగి మొదలుపెట్టిన కలర్స్ స్వాతి

తెలుగమ్మాయిగా కెరీర్ ను నిర్మించుకున్న కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటోంది. కలర్స్ స్వాతి నటిస్తోన్న తాజా చిత్రం పంచతంత్రం. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోగా మళ్ళీ ఈరోజు నుండి తిరిగి మొదలైంది.

ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు హర్ష డైరెక్ట్ చేస్తున్నాడు. పంచతంత్రం షూటింగ్ ప్రస్తుతం  చివరి దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంచనా. ఈ చిత్రంలో ఇంకా శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, సముద్రఖని, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య నటిస్తున్నారు.

- Advertisement -

పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అఖిలేష్ వర్ధన్, సృజన్ యర్రబోలు నిర్మిస్తున్నారు. పంచతంత్రం చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All