రక్షిత్ హీరోగా రఘ కుంచె విలన్గా నటించిన చిత్రం `పలాస 1978`. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. స్టోరీ, స్క్రీన్ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే సినిమా మరో రేంజ్లో వుండేదని, అయినా దర్శకుడిగా తొలి చిత్రంతోనే కరుణ కుమార్ ఆకట్టుకున్నాడని ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా రిలీజ్కు ముందే దర్శకుడికి గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి బంపర్ ఆఫర్ లభించింది కూడా.
`పలాస 1978` రిలీజ్కు ఒక్క రోజు బుందే ఈ చిత్ర దర్శకుడు కరుణకుమార్కు తమ సంస్థలో సినిమా చేయమని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అడ్వాన్స్గా చెక్ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రిలీజైన `పలాస 1978` చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య విజయాన్ని సాధిస్తూ వసూళ్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కరుణ కుమార్పై తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చింది విజయ్ దేవరకొండతో సినిమా కోసమన్నది తాజా టాక్.
విజయ్కి కథ వినిపించమని అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గీతాలో విజయ్ దేవరకొండ గీతా గోవిందం, ట్యాక్సీవాలా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ అదే తరహా హిట్ని కరుణకుమార్తో విజయ్ దేవరకొండకు అందించాలని అల్లు అరవింద్ అతనికి అడ్వాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్లో ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.