గత ఆరు నెలలుగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోవడం, థియేటర్స్ మూసి వేయడంతో సినిమా వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇదే సమయంలో రిలీజ్కు సిద్ధమైన సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ మంచి వేదికగా మారింది. దీంతో గత ఆరు నెలలుగా రిలీజ్కు నోచుకోని చిత్రాలు వరుసగా ఓటీటీ బాటపడుతున్నాయి.
ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన `వి` అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికన్ని క్రేజీ చిత్రాలు ఓటీటీ బాటపడుతున్నాయి. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో కె. కె. రాధామోహన్ నిర్మించిన `ఒరేయ్ బుజ్జిగా!`చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా వెల్లడించారు.
మాళవిక నాయర్, హెభా పటేల్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా `ఆహా` ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ విధించడానికి ముందు మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఉన్నట్టుండి లాక్డౌన్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఓటీటీకే ఈ మూవీ కూడా ంటూ ప్రచారం జరిగితే అలాంటిది ఏమీ లేదని, థియేటర్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని `ఆహా`లో రిలీజ్ చేస్తున్నారు.