`నేను దర్శకుడు విజయ్ స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్న వేళ మొదలైన కథ `ఒరేయ్ బుజ్జిగా`. అక్కడ మొదలైన ఈ సినిమా ఈ ఉగాదికి శడ్రుచుల పచ్చడిలా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్ ఇప్పటికే పాపులర్ అయింది. ఇటీవల విడుదల చేసిన కురిసే.. కురిసే..మంచి ఆదరణ లభిస్తోంది అంటున్నారు నిర్మాత కె.కె. రాధామోహన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. రాజ్ తరుణ్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కుమార్ కొండ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ `యూత్కి, ఫ్యామిలీస్కి నచ్చే అన్ని అంశాలున్న చిత్రమిది. నంద్యాల రవి డైలాగ్స్, ప్రవీన్ పూడి ఎడిటింగ్, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి చక్కగా కుదిరాయి. విజయ్కుమార్ కొండ పక్కా ప్లానింగ్తో సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేశాం. ఇలా చేయడం వల్ల నిర్మాతకు మంచి జరుగుతుంది. వాణీవిశ్వనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్కి తల్లిగా నటించింది. ఆమెకిది మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ చిత్రానికి మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయబోతున్నాం. ఈ నెల 14న కరీంనగర్లో, 19న తిరుపతితో, 21న హైదరాబాద్లో చేయబోతున్నాం. 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పల్లె విజిట్ చేయబోతున్నాం`అన్నారు.
నిర్మాతతో తనకు చాలా కాలంగా మంచి అనుబంధం వుందని, కథకు ఏమి కావాలో అన్నింటిని అందించిన సపోర్ట్ చేశారని, సినిమాలో భారీ తారాగణం వుందని, ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్ పక్కింటి కుర్రాడిలా వుంటాడని, హండ్రెడ్ పర్సెంట్ అతనికి తగ్గసినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ అని, థియేటర్లో చూసిన ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేస్తారని రాజ్తరుణ్ స్పష్టం చేశారు.