Homeటాప్ స్టోరీస్శివాజీరాజా - నరేష్ ల మధ్య మళ్ళీ యుద్ధం

శివాజీరాజా – నరేష్ ల మధ్య మళ్ళీ యుద్ధం

Once again war in MAAశివాజీరాజానరేష్ ల ఆమధ్య మళ్ళీ యుద్ధం నెలకొంది . గత టర్మ్ శివాజీరాజా అధ్యక్షుడిగా పనిచేయగా నరేష్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు . అయితే ఈసారి మాత్రం అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా – నరేష్ లు ఇద్దరూ పోటీ పడగా నరేష్ విజయం సాధించాడు . ఇంకా లొల్లి ఏముంది అని అనుకుంటున్నారా ? ఇక్కడే చిక్కొచ్చి పడింది . శివాజీరాజా ఎన్నికల్లో ఓడినప్పటికీ తనకు ఇంకా మార్చి 31 వరకు సమయం ఉందని కాబట్టి ఈలోపు నరేష్ అధ్యక్ష పదవిలో కూర్చో కూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు శివాజీరాజా .

 

- Advertisement -

దాంతో నరేష్ కూడా యుద్దానికి సిద్ధం అంటూనే మీడియా ముందుకు వచ్చాడు , శివాజీరాజాపై ఆరోపణలు చేస్తున్నాడు కానీ మాకు మాత్రం గొడవ చేయడం ఇష్టం లేదు అని అంటున్నాడు . అసలు విషయం ఏంటంటే ఈనెల 22 న ప్రమాణ స్వీకారం చేద్దామని అనుకున్నాడట నరేష్ నాకు 31వరకు సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు నరేష్ ఆగాల్సిందే అని శివాజీరాజా అంటున్నాడట . మరి పరిశ్రమ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి .

English Title : Once again war in MAA

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All