దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన చిత్రం `రామయ్యా వస్తావయ్యా`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారీష్శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. యావరేజ్ హిట్గా నిలిచిన ఈ చిత్రంలో సమంత, శృతిహాసన్ హీరనోయిన్లుగా నటించారు. ఇందులో శృతిహాసన్ పాత్ర నడివి తక్కువే అయినా కథకు చాలా కీలకంగా వుంటుంది.
ఆ తరువాత మళ్లీ ఎన్టీఆర్తో కలిసి మరో చిత్రంలో నటించలేదు. `దమ్ము` చిత్రంలో నటించాల్సి వచ్చినా అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ఎన్టీఆర్తో కలిసి శృతిహాసన్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్. రాధాకష్ణ, హీరో నందమూరి కల్యాణ్రామ్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో మెయిన్ హీరోయిన్గా శృతిహాసన్ని ఎంపిక చేశారని తెలిసింది. రెండవ హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటించనుందట.