Homeగాసిప్స్మ‌రోసారి `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` జోడీ!

మ‌రోసారి `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` జోడీ!

మ‌రోసారి `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` జోడీ!
మ‌రోసారి `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` జోడీ!

దాదాపు ఏడేళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా హారీ‌ష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. యావ‌రేజ్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో స‌మంత‌, శృతిహాస‌న్ హీర‌నోయిన్‌లుగా న‌టించారు. ఇందులో శృతిహాస‌న్ పాత్ర న‌డివి త‌క్కువే అయినా క‌థ‌కు చాలా కీల‌కంగా వుంటుంది.

ఆ త‌రువాత మ‌ళ్లీ ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌రో చిత్రంలో న‌టించ‌లేదు. `ద‌మ్ము` చిత్రంలో న‌టించాల్సి వ‌చ్చినా అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది‌. తాజాగా ఎన్టీఆర్‌తో క‌లిసి  శృతిహాస‌న్ న‌టించనున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్ ప్రస్తుతం న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమా త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాక‌ష్ణ‌, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు.  ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్‌లు న‌టించ‌నున్నార‌ట‌. అందులో మెయిన్ హీరోయిన్‌గా శృతిహాస‌న్‌ని ఎంపిక చేశార‌ని తెలిసింది. రెండ‌వ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ న‌టించ‌నుంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All