యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. అప్పటినుండి హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ కోలుకుంటున్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు త్వరలోనే కరోనాను జయిస్తాననే నమ్మకాన్ని పలుమార్లు వ్యక్తం చేసాడు. ఇదిలా ఉంటే రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను అంగరంగవైభవంగా ప్రతీ ఏటా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అది వద్దంటున్నాడు తారక్.
నా ఫ్యాన్స్ అందరికీ విన్నపం అంటూ ఒక లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తనను ఇంతలా ఆదరిస్తున్నందుకు ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ ఎమోషనల్ అయ్యాడు. “ప్రస్తుతమున్న లాక్ డౌన్, కర్ఫ్యూ దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు ఎక్కడా నిర్వహించవద్దని అభిమానులను కోరుకుంటున్నాను. ఇది మనం బాధ్యతగా మెలగాల్సిన సమయం. సంబరాలు చేసుకునే సమయం కాదు. దేశం భారీ విపత్తుతో పోరాడుతోంది. కరోనాను జయించిన రోజున అందరం కచ్చితంగా కలిసి సంబరాలు చేసుకుందాం” అని ఎన్టీఆర్ మెసేజ్ ను పోస్ట్ చేసాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.
A humble appeal ???????? pic.twitter.com/vzEtODgtEf
— Jr NTR (@tarak9999) May 19, 2021