యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్ పంజాబ్లో హల్చల్ చేస్తోంది. బ్లాక్ జీప్లో రావణిడి గెటప్ ధరించి కొంత మంది వీధుల్లో తిరుగుతూ కనిపించిన వాళ్లని హడలెత్తిస్తున్నారు. వీరి చేష్టలకు బ్యాగ్రౌండ్లో ఎన్టీఆర్ సాంగ్ ప్లే అవుతూ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే… యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం `జై లవకుశ`. బాబి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆశించి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఇందులో ఎన్టీఆర్ పోషించిన జై పాత్ర మాత్రం పాపులర్ అయింది. ఈ పాత్రపై `రావణా..జై జై జై..` అంటూ సాగే పాటని చిత్రీకరించారు. ఇది సినిమా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. చార్ట్ బస్టర్లో టాప్ సాంగ్స్ల జాబితాలో చేరింది. ఇదే పాటను పంజాబ్లో జరిగిన ఓ ఊరేగింపులో వాడారు. రావణ వేషధారణలో వీధుల్లో ఓ వ్యక్తి నడుస్తూ హావభావాలు పలికిస్తుండగా వెనక వస్తున్న జీప్లో `రావణా.. ` అంటూ ఎన్టీఆర్ సాంగ్ హల్చల్ చేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశారు. ఈ పాటకు దేవినే సంగీతం అందించారు.
— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 4, 2020