లాక్డౌన్ కారణంగా చాలా మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు జీతాలు కట్ కావడం, ఉద్యోగాలు పోవడం వంటి కారణాలతో మధ్య తరగతి జీవితాలు అస్థవ్యస్థమయ్యాయి. కార్యాలయాలన్నీ మూసేయడం, ఇంటికే అంతా పరిమితం కావడంతో జనజీవితం స్థంభించిపోయింది. దీంతో తన వద్ద పసనిచేస్తున్న సిబ్బందికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందస్తుగా మూడు నెలల జీతాలు సిబ్బందికి అందజేసిన విషయం తెలిసిందే.
ఇదే తరహాలో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి ముందస్తుగా జీతాలు చెల్లించారట. అంతే కాకుండా తన సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తన వ్యక్తిగత సిబ్బందిని సంప్రదించమని చెప్పారట. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తోంది. కరోనా క్రైసిస్ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్టీఆర్ 75 లక్షలు విరాళం అందించారు.
25 లక్షలు తెలంగాణకు, 25 లక్షలు ఏపీకి, మరో 25 లక్షలు సినీ కార్మికులకు అందించారు. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 8న విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ టీజర్తో పాటు త్రివిక్రమ్ సినిమా టైటిల్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.