యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి హోస్ట్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ సీజన్ 1 ను విజయవంతంగా హోస్ట్ చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత బుల్లితెరకు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్ ద్వారా హోస్ట్ గా మారుతోన్న విషయం తెల్సిందే. సమ్మర్ లోనే ఈ ప్రోగ్రాంను మొదలుపెట్టాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇది వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు తిరిగి పట్టాలెక్కనుంది. ఈ పోగ్రామ్ లో పాల్గొనడం కోసం ఆడిషన్స్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రాం లుక్ కోసం టెస్ట్స్ లో పాల్గొంటున్నాడట. త్వరలోనే ఒక లుక్ ను ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది.
ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం కోసం ఎన్టీఆర్ భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. జెమినీ టివిలో ఈ షో ప్రసారం కానుంది.