తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ అక్క కళ్యాణ్ రామ్ చెల్లెలు కూకట్ పల్లి నుండి పోటీ చేస్తోంది దాంతో ఇద్దరు అన్నాదమ్ములు ప్రెస్ నోట్ హడావుడిగా విడుదల చేసారు , అక్క గెలవాలని ఆకాంక్షించారు అయితే అక్క తరుపున ప్రచారం చేస్తాడా ? లేదా ? చెప్పలేదు ఎన్టీఆర్ . దాంతో మళ్ళీ కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన తరుణంలో యుద్ధ వాతావరణం నెలకొంది . ఈరోజు ఉదయం బాలయ్య బాబాయ్ తో కలిసి ఎన్టీఆర్ అక్క సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తాత నందమూరి తారకరామారావు కు నివాళులు అర్పించి ఆశీస్సులు అందుకుంది . ఆ తర్వాత మహాప్రస్థానం లోని హరికృష్ణ సమాధి వద్దకు చేరుకొని అక్కడ కూడా నివాళులు అర్పించింది తండ్రికి .
అయితే ఆమె వెంట బాలయ్య బాబాయ్ , రామకృష్ణ బాబాయ్ లు ఉన్నారు కానీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు లేరు దాంతో విమర్శలు మొదలయ్యాయి . అవి ఇంకా పెద్దవి కాకముందే మేలుకుంటే మేలని భావించారేమో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు అన్నాదమ్ములు ఇద్దరూ . ప్రెస్ నోట్ అయితే విడుదల చేసారు , అక్క గెలవాలని కోరుకున్నారు కానీ ప్రచారం చేస్తారా ? లేదా ? అన్నది మాత్రం చెప్పలేదు . ఇందులో మతలబు ఏంటో మరి , లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ? అంతేకదా !
English Title: Ntr and kalyan ram not attend with suhasini