Homeగాసిప్స్రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారా?

రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారా?

రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారా?
రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారా?

క‌న్న‌డ చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. సైలెంట్‌గా వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సృష్టించి హీరో య‌ష్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ని తెర‌కెక్కిస్తున్నారు. 20 రోజుల షూటింగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తయింది. లాక్‌డౌన్ ఎత్తేసి షూటింగ్‌ల‌కు అనుమ‌తిస్తే చిత్రాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడు? త‌రువాత సినిమా ఎలా వుండ‌బోతోంది?  మ‌రో పాన్ ఇండియా స్థాయి సినిమాని ప్లాన్ చేశారా ? అని గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌శాంత్ నీల్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తెలుగు హీరోతో చేయ‌బోతున్నార‌ని, ఆ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అని తాజాగా తెలిసింది.

- Advertisement -

అ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ నిర్మించ నుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కు 2 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ 31వ చిత్రంగా తెర‌పైకి రానున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో అత్యంత భారీగా వుంటుంద‌ని, స‌రికొత్త నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All