కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తోంది. దీని కారణంగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, ఇలాగైతే పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం చాలా కష్టం అని భావించిన డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఇటీవల కొచ్చీలో ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మార్చి 31 వరకు కేరళ వ్యాప్తంగా థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా తమిళనాడు థియేటర్ల సంఘం కూడా థియేటర్లని బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 27 నుంచి థియేటర్లని బంద్ చేయాలని తీర్మానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడులో థియేటర్లని బంద్ చేయబోతోంది కరోనా వైరస్ కారణంగా కాదని, కేంద్ర ప్రభుత్వం పెంచి ట్యాక్స్ కారణంగా అని తెలిసింది. 10 శతం మాత్రమే టీడీఎస్ కట్టడానికి తాము సిద్ధంగా వున్నామని అయితే కేంద్రం తెచ్చిన కొత్త విధానం వల్ల అది తమకు తలకు మించిన భారంగా పరిణిమించబోతోందని దీనికి నిరసనగానే థియేటర్లలో ఈ నెల 27 నుంచి కొత్త చిత్రాల రిలీజ్లని బంద్ చేయబోతున్నామని దర్శకుడు టి. రాజేందర్ వెల్లడించారు.
అయితే తాము ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టడం లేదని, ఈ పద్దతిని మార్చుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నామని టి. రాజేందర్ వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కి టి. రాజేందర్ గత కొంత కాలంగా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు.