Homeఎక్స్ క్లూసివ్సినిమా ఫంక్ష‌న్‌లు ఇక వుండ‌వు -  శోభు యార్ల‌గ‌డ్డ

సినిమా ఫంక్ష‌న్‌లు ఇక వుండ‌వు –  శోభు యార్ల‌గ‌డ్డ

సినిమా ఫంక్ష‌న్‌లు ఇక వుండ‌వు -  శోభు యార్ల‌గ‌డ్డ
సినిమా ఫంక్ష‌న్‌లు ఇక వుండ‌వు –  శోభు యార్ల‌గ‌డ్డ

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచానికి కొత్త గుణ‌పాఠాలు నేర్పుతోంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ దీని కార‌ణంగా విప్ల‌వాత్మ‌క మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్ప‌టికే దీని కార‌ణంగా థియేట‌ర్లు, సినిమా షూటింగ్‌లు అన్నీ ఆగిపోయాయి. చాలా మంది ఉపాది కోల్పోతున్నారు. రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు కూడా న‌ష్టాలు చ‌విచూస్తున్నారు.

క‌రోనా ముగిసిన త‌రువాత చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌మూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని `బాహుబ‌లి` నిర్మాత‌ల్లో ఒక‌రైన శోభు యార్ల‌గ‌డ్డ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. దీనిపై ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఫిల్మ్ మార్కెటింగ్ గ‌తంలోలా వుండ‌ద‌ని, ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లు, ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాలు, థియేట‌ర్స్‌, మాల్స్‌కు వెల్ల‌డం, రోడ్ ట్రిప్స్ లాంటివి ఇక‌పై వుండ‌వు. సినిమా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించరు. డిజిట‌ల్ మార్కెటింగ్‌, ఆన్‌లైన్ సంభాష‌ణ‌లు ఎక్కువ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఆయ‌న నిర్మిస్తున్న తాజా చిత్రం `ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్రరూప‌స్య‌` చిత్రాన్ని నిర్మించారు. స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` ఫేం వెంక‌టేష్ మ‌హా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఏప్రిల్ 17న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All