మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇటీవలే ఆమెని చిత్ర బృందం ఫైనల్ చేసింది. `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యువ దర్శకుడు పరశురామ్ నుంచి వస్తున్న సినిమా కావడం, `సరిలేరు నీకెవ్వరు` వంటి బిగ్ హిట్ ఫిల్మ్ తరువాత మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు పాత్ర చిత్రణ కొత్తగా వుంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్తో స్పష్టమైంది. ఇటీవల సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్లుక్ తో సినిమాపై మహేష్ అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ని చిత్ర బృందం సంప్రదించినట్టు తెలిసింది.
ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం నివేదా థామస్ని సంప్రదించారట. మహేష్ సినిమా కావడంతో నివేదా కూడా ఆసక్తిగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కరోనా క్రైసిస్ తగ్గుముఖం పట్టాక ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని హీరో మహేష్, దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేస్తున్నారట.