ఆరు నెలల విరామం తరువాత టాలీవుడ్లో షూటింగ్ లు మొదలవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు వరుసగా పునః ప్రారంభం అవుతున్నాయి. అయితే అందులో అత్యధిక శాతం ఓటీటీల్లో రిలీజ్ కావడానికే సిద్ధమవుతున్నాయి. తాజాగా నితిన్ నటిస్తున్న `రంగ్ దే` మూవీ షూటింగ్ తిరిగి మొదలైంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదే కాంబినేషన్లో ఇటీవల `భీష్మ` సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో `రంగ్ దే ` చిత్రాన్ని నితిన్ తిరిగి మొదటుపెట్టారు. షూటింగ్ పూర్తి కానీ ఈ మూవీ కి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ఆఫర్ ఇచ్చేసిందట.
ఇటీవల `భీష్మ` బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ చిత్రానికి జీ5 36 కోట్లు డిజిటల్ రైట్స్ కోసం ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆఫర్ నచ్చడంతో నితిన్ నో ఆబ్జెక్షన్ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీకి చెప్పేశారట. దీంతో ఈ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.