ఈ ఏడాది యంగ్ హీరో నితిన్ నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. కాకపొతే ఈ రెండు సినిమాలు చెక్, రంగ్ దే కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్న చిత్రం మేస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. నభా నటేష్ కథానాయిక. తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది.
మేస్ట్రో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయ్యాక పవర్ పేట మొదలుపెట్టాలి నితిన్. కానీ తన నిర్ణయం మార్చుకున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథకు ఓటు వేసాడు. వక్కంతం వంశీ తొలి చిత్రం నా పేరు సూర్య అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో వంశీ రెండో సినిమా ప్రయత్నాలకు గట్టి బ్రేకే పడింది.
ఇప్పుడు రెండో చిత్రాన్ని నితిన్ తో ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లోనే ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.