యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ `నిశ్శబ్దం`. స్వీటీ అనుష్క నటించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్తో కలిసి కోన వెంకట్ నిర్మించారు. హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాల స్థాయిలో సరికొత్త నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించారు. గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా ఈ సినిమాపై వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ మార్చి నుంచి కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడం, థియేటర్లు మూసేయడంతో `నిశ్శబ్దం` రిలీజ్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం మొదలైంది. దీనిపై మేకర్స్ స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మా చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయమని, థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే తాజాగా మరోసారి ఈ చిత్రంపై ఇదే తరహా వార్తలు మళ్లీ ప్రచారం కావడం మొదలైంది. నాని, సుధీర్బాబు నటించిన మల్టీస్టారర్ చిత్రం `వి` చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో `నిశ్శబ్దం` కూడా ఓటీటీ లోనే రిలీజ్ కాబోతోందిని, అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల మళ్లీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.