Homeటాప్ స్టోరీస్నిఖిల్ ను మోసం చేసిన ఆ నిర్మాతలు ఎవరు?

నిఖిల్ ను మోసం చేసిన ఆ నిర్మాతలు ఎవరు?

నిఖిల్ ను మోసం చేసిన ఆ నిర్మాతలు ఎవరు?
నిఖిల్ ను మోసం చేసిన ఆ నిర్మాతలు ఎవరు?

లక్ష్మి మంచు ప్రస్తుతం నిర్వహిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమంలో సెలెబ్రిటీలు ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో నిఖిల్ ఈ టాక్ షో కి గెస్ట్ కి విచ్చేశాడు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ హ్యాపీ డేస్ సినిమాకు తను ఆడిషన్ ఇచ్చినపుడు ఎంతో మంది వచ్చారని, ఇంత మందిలో తను సెలెక్ట్ అవుతానా అన్న సందేహం వచ్చిందని చెప్పాడు. అందుకనే తనకున్న కాంటాక్ట్స్ ద్వారా శేఖర్ కమ్ములను పర్సనల్ గా కలిశానని, దాని తర్వాతే తనను సెలెక్ట్ చేసారని అన్నాడు.

ఒకవేళ తను పర్సనల్ గా కలవకపోతే కచ్చితంగా తనకు అవకాశం రాకపోయి ఉండేదని అన్నాడు. అలాగే హ్యాపీ డేస్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత తన వద్దకు ఎంతో మంది నిర్మాతలు వచ్చారని, అయితే అప్పుడు సరైన గైడెన్స్ లేక చాలా దెబ్బతిన్నట్లు చెప్పాడు. పది లక్షలు పట్టుకువచ్చి సినిమాలు తీద్దామన్న వారికి కూడా డేట్లు ఇచ్చినట్లు, దీని వల్ల వాళ్ళు కొన్ని రోజులు సినిమా తీస్తున్నట్లు హడావిడి చేయడం, తర్వాత సినిమాను మధ్యలోనే వదిలేయడం చేసేవాళ్ళు. దీనివల్ల తాను చాలా నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు నిఖిల్. కెరీర్ ఆరంభంలో సమస్యలు అందరికీ వస్తాయి, కానీ దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళేవాడు సక్సెస్ అవుతాడు అని చెప్పాడు నిఖిల్.

- Advertisement -

ప్రస్తుతం హిట్టు కొట్టాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న నిఖిల్, అర్జున్ సురవరం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.. నవంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All