దక్షిణాదిపై పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు దక్షిణాది బోర్ కొట్టిందని, ఎంత ప్రయత్నించినా సరైన అవకాశాలు రాలేదని, ముందు స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రమే నటించాలని భావించానని, కానీ ఆ తరువాత ఏ సినిమా దొరికితే ఆ సనిమాని అంగీకరించాల్సి వచ్చిందని, ఎంత ప్రయత్నించినా మంచి పాత్రలు, సినిమాలు తనకు దక్కలేదని, అందుకే తనకు దక్షిణాది అంటే బోర్ కొట్టిందని వెల్లడించింది.
లండన్ నుంచి ఇండియాకు వచ్చింది నికిషా పటేల్. బాలీవుడ్లో క్రేజీ స్టార్తో సినిమా చేయాలని, అక్కడే సెటిల్ అవ్వాలని కలలు గన్న నికీషా ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. దాంతో తెలుగులో పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `పులి` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఆ తరువాత కూడా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో చిన్న సినిమాల్లోనూ నటించాల్సిన పరిస్తితి ఏర్పడింది.
దీంతో విసుగుపుట్టిన నికిషా టాలీవుడ్కు టాటా చెప్పేసి కన్నడ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది. అయినా ఫలితం లేకపోవండతో తిరిగి మళ్లీ లండన్కే వెళ్లిపోయింది. అక్కడ నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న ఆమె త్వరలో అక్కడి చిత్రాల్లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ రాణించని నికిషాకు అక్కడ అవకాశాలు దక్కేనా అని అంతా అవాక్కువతున్నారు.