యాంకర్ రష్మీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు . ఇంతకీ రష్మీ చేసిన తప్పేంటంటే …….. హోలీ రోజున రంగులు పూసుకుంటున్నారు బాగానే ఉంది కానీ జంతువులకు మాత్రం రంగులు పూయకండి ఎందుకంటే వాటికి స్కిన్ ఎలర్జీ వస్తుంది పాపం అని ట్వీట్ చేయడమే ! ఇంకేముంది ఈ ట్వీట్ చూసి నెటిజన్లకు విపరీతంగా కోపం వచ్చింది అంతే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు .
హిందువుల పండగల సమయంలోనే ఎక్కువగా స్పందిస్తున్నావ్ ! ముస్లిం ల పండగలప్పుడు అలాగే ఇతర మతస్థుల పండగలప్పుడు మాత్రం ఎందుకు స్పందించవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నువ్ హిందూ వ్యతిరేకివి అంటూ నిప్పులు కక్కారు . దాంతో నేను హిందూ వ్యతిరేకిని కాను అని చెప్పుకోవాల్సి వచ్చింది . ఇటీవలే విశాఖ పట్టణం సమీపంలో రష్మీ ప్రయాణించిన కారు ఓ వ్యక్తిని ఢీ కొన్న విషయం తెలిసిందే .
English Title: Netizens fires on anchor Rashmi