ఆయుష్మాన్ ఖురానా హీరోగా విభిన్నమైన పాత్రలో నటించిన చిత్రం `అంధాదున్`. టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యంగ్ హీరో నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రంగ్ దే, చంద్ర శేఖర్ ఏలేటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న నితిన్ `అంధాదున్` రీమేక్ని సొంత బ్యానర్పై ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.
హిందీలో ఈ చిత్రానికి జాతీయు పురస్కారం లభించింది. తెలుగులో టెక్నికల్ గా, కాస్టింగ్ పరంగా ఏ విషయంలోనూ తగ్గకూడదని హీరో నితిన్ చాలా కేర్ తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టాబు పోషించిన కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనుందంటూ ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రని నయనతార చేత చేయించాలని నితిన్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమెతో నితిన్ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు రీమేక్ రైట్స్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ 3. 5 కోట్లకు దక్కించుకుంది. మరో కీలక పాత్ర కోసం యాంకర్ అనసూయని కూడా చిత్ర బృందం సంప్రదించినట్టు తెలిసింది. నమనతార ఓకే అంటే నితిన్ సినిమా రేంజ్ మారడం ఖాయం అని అంతా అంటున్నారు. పాండిచ్చేరి నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని అక్కడే షూటింగ్ చేయబోతున్నారని తాజా టాక్.