నయనతార, విఘ్నేష్ శివన్ల జోడీ నిత్యం వార్తల్లో నిలుస్తూ కోటీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జోడీ పెళ్లి గురించి అడిగితే మాత్రం డేటింగ్పై వైరాగ్యం ఏర్పడిన తరువాతే పెళ్లి చేసుకుంటామంటూ షాకిచ్చారు విఘ్నేష్ శివన్. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట గుళ్లూ గోపురాలు అంటూ తీర్థ యాత్రలు చేస్తోంది.
ఓ పక్క స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని చేజార కుండా చూసుకుంటూనే మరో పక్క తన ప్రేమయాణాన్ని క్రేజీగా నడిపిస్తోంది నయన్. భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న నయనతార రాయల్ లైఫ్ని అనుభవిస్తోంది. ఇటీవల వరుసగా విఘ్నేష్తో కలిసి గుళ్లూ గోపురాలు, నవగ్రహ పూజ అంటూ తిరిగిన నయన్ తాజాగా విఘ్నేష్ శివన్ బర్త్డే కోసం గోవా వెళ్లింది.
ప్రత్యే చార్టెడ్ ఫ్లైట్లో గోవా వెళ్లిన ఈ జంట అక్కడే మూడు రోజుల పాటు బర్త్డే వేడుకల్ని జరుపుకుంది. ఇందు కోసం నయన్ ఏకంగా 25 లక్షలు ఖర్చు చేయడం ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బర్త్డే కోసమే ఈ రేంజ్లో ఖర్చు చేస్తే ఇక పెళ్లికి ఏ స్థాయిలో నయన్ ఖర్చు చేస్తుందో నని సర్వత్రా హాట్ గా చర్చ సాగుతోంది.