కాలంతో పాటు చాలా మంది మారుతున్నారు. ఎన్నడూ చేయని పనులు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. లేడీ సూపర్స్టార్ నయనతార కూడా ఈ ఏడాది తన పంథాను మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. క్రేజీ చిత్రాల్లో మాత్రమే నటించే నయనతార తన పంథాకు భిన్నంగా ఈ ఏడాది అడుగులు వేయడం మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. తాజాగా ఆమె అంగీకరిస్తున్న చిత్రాలే ఆమె పంథా మార్చిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ `అంధాదూన్`. టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ పురస్కారాన్ని అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది. 3 కోట్ల 50 లక్షలకు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ చిత్రాన్ని బాలీవుడ్కి మించి తెరపైకి తీసుకురావాలని క్రేజీ తారలని సెట్ చేసే పనిలో వున్నారు.
టబు పోషించిన పాత్ర కోసం నయనతారని నితిన్ సంప్రదిస్తున్నారట. అయితే నయన మాత్రం టబు పాత్రలో నటించాలంటే 4 కోట్లు డిమాండ్ చేస్తోందంట. మరి నితిన్ అంత బేర్ చేస్తాడా? నయన కండీషన్కు తలొగ్గుతాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. `అంధాదున్` తెలుగు రీమేక్కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు.