Homeటాప్ స్టోరీస్వివాదంలో నాని `అంటే సుంద‌రానికి`?

వివాదంలో నాని `అంటే సుంద‌రానికి`?

వివాదంలో నాని `అంటే సుంద‌రానికి`ఝ?
వివాదంలో నాని `అంటే సుంద‌రానికి`ఝ?

నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `అంటే.. సుందరనికి..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడ‌ల్ట్ కామెడీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌పైకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. అయితే తాజాగా ఈ మూవీ పై వివాదం మొద‌లైంది.

ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ `పెళ్లి చూపులు` ఫేమ్ రాజ్ కందుకూరి నిర్మించిన `మెంట‌ల్ మ‌దిలో` చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత `బ్రోచే వారెవ‌రురా` చిత్రాన్ని చేసిన వివేక్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రాజ్ కందుకూరికి చేస్తాన‌ని అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. దాన్ని ప‌క్క‌న పెట్టి త‌న మూడ‌వ చిత్రాన్ని మైత్రీ వారితో చేస్తుండ‌టం ఇప్ప‌డు స‌మ‌స్య‌గా మారింది. దీనిపై ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో నిర్మాత రాజ్ కందుకూరి ఫిర్యాదు చేయ‌డంతో వివాదం వెలుగులోకి వ‌చ్చింది.

- Advertisement -

ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన త‌నకు మూడ‌వ చిత్రాన్ని చేస్తాన‌ని మాటిచ్చిన వివేక్ ఆత్రేయ ఆమ‌ట‌ని త‌ప్పి మైత్రీ వారికి చేస్తున్నాడ‌ని, ఆ సినిమా త‌న‌తో చేయాల‌ని రాజ్ కందుకూరి ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. `అంటే.. సుంద‌రానికి` చిత్రాన్ని ప్రారంభించే ముందు త‌న‌తో మైత్రీ వారు మాట్లాడాల‌ని, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాల‌ని రాజ్ కందుకూరి డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All