నేచురల్ స్టార్ నాని తొలిసారి విలన్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్న చిత్రం `వి`. సుధీర్బాబు హీరోగా నటిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఎట్టకేలకు లాట్ ఆఫ్ తర్జన భర్జనల తరువాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5న రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితీరావు హైదరీ నటించారు.
నేచురల్ స్టార్ నాని నటించిన 25వ చిత్రమిది. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని చేసిన మూడవ సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై నాని భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన `వి` ట్రైలర్ని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. హీరో నాని తన భార్యగా నటించిన అదితీరావు హైదరిని చంపిన వారిని ఒక్కొక్కరిగా మర్డర్ చేస్తూ ఆ ప్లేస్లో `వి` అనే అక్షరాన్ని వదిలి వెళుతుంటాడట.
నాని వెంటపడుతూ ఈ హత్యల వెనకున్న మిస్టరీని ఛేధించే ఇన్వెస్టగేషన్ ఆఫీసర్గా హీరో సుధీర్బాబు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అదితీరావుని ఎవరు హత్య చేశారు? అందుకు బాధ్యులైన వారిని వరుసగా హత్య చేస్తూ నాని `వి` అక్షరాన్ని ఎందుకు స్పాట్లో ఎందుకు వదిలి వెళుతున్నాడు? ఈ రేసులో ఎవరు గెలిచారు? నానిని చివరికి సుధీర్బాబు పట్టుకున్నాడా? .. అతనికి నివేదా థామస్ ఎందుకు సహాయం చేస్తోంది? అన్నది అసలు కథగా తెలుస్తోంది. ఇది తెలిసిన వాళ్లంతా `వి` బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే.