తెలుగులో జెంటిల్మెన్, నిన్నుకోరి వంటి విభిన్నమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది నివేదా థామస్. సూపర్ స్టార్ రజనీకాంత్కు కూతురిగా `దర్బార్`లో నటించిన నివేదా ప్రస్తుతం తెలుగులో నాని, సుధీర్బాబు కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `వి` చిత్రంలో నటించింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుండగా నివేదా థామస్ తాజాగా మరో బంపర్ ఆఫర్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది.
మహేష్ నటిస్తున్న `సర్కారి వారి పాట`లోని ఓ కీలక పాత్రలో నివేదా నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు నివేదా థామస్కు పాన్ ఇండియా స్థాయి చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్టు తెలిసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ని తెరకెక్కించబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి.అశ్వనీదత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే నటించనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్ర కథకు కీలకమైన ఓ పాత్రలో నివేదా థామస్ కనిపించనుందని, ఇటీవలే ఈ చిత్రం కోసం ఆమెని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ని త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే.