నేచురల్ స్టార్ నాని, సుధీర్బాబు తొలి కలయికలో రూపొందిన చిత్రం `వి`. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25న ఉగాది కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఓ కొలిక్కి వస్తే రిలీజ్ ఎప్పుడు వుంటుంది అన్న దానిపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా వుంటే ఈ చిత్రలో నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి హీరో నాని నెగెటివ్ ఛాయలున్న పాత్రలో నటించారు. సినిమా అంతా రక్షకుడు, రాక్షసుడు అనే కాన్సెప్ట్ నేపథ్యంలో సాగేలా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోలు నని, సుధీర్బాబు కాదని తెలిసింది.
ఈ చిత్ర కథని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పవర్స్టార్ పవన్కల్యాణ్, ప్రిన్స్ మహేష్బాబుని ఉద్దేశించి రానుకున్నారట. అయితే అది అయకయేపని కాదని గ్రహించి ఆ పాత్రల్లో నాని, సుధీర్బాబుని తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సుధీర్బాబు ఇటీవల ఓ షోలో వెల్లడించారు.