నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింఘరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రిత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ముందు ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాలనుకున్నారు. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.
ఆ తరువాత వెంకట్ బోయిన పల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకొచ్చారు. దీంతో ఈ మూవీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసిన దర్శకుడు ఇటీవలే హీరోయిన్లని ఫైనల్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరో నాని దర్శకుడిగా కనిపిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత హీరోగా మారిన విషయం తెలిసిందే. దర్శకుడు కావాలన్న అతని కలని `శ్యామ్ సింఘరాయ్` ఈ విధంగా తీరుస్తున్నట్టు చెబుతున్నారు.
`శ్యామ్ సింఘ రాయ్` ప్రధాన ఇతివృత్తం పునర్జన్మతో కోల్కతా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతోంది. ఎక్కువ భాగం కోల్కతాలో జరగబోతోంది.