Homeటాప్ స్టోరీస్మరోసారి సాయి పల్లవితో జతకట్టనున్న శర్వానంద్

మరోసారి సాయి పల్లవితో జతకట్టనున్న శర్వానంద్

మరోసారి సాయి పల్లవితో జతకట్టనున్న శర్వానంద్
మరోసారి సాయి పల్లవితో జతకట్టనున్న శర్వానంద్

టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ అదే ఊపుని సక్సెస్ ల విషయంలో చూపించలేకపోతున్నాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన సినిమాలు అన్నీ ప్లాపులుగా మిగిలాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, ఇక రీసెంట్ గా విడుదలైన జాను. ఇలా అన్ని సినిమాలు కూడా ప్లాపవ్వడంతో శర్వానంద్ తన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే పెట్టుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఒక కొత్త దర్శకుడు పనిచేస్తున్నాడు. అలాగే ఈ సినిమా సేంద్రీయ వ్యవసాయం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. శ్రీకారంలో శర్వానంద్ లో యూఎస్ లో పెద్ద చదువులు చదువుకుని వచ్చి ఇక్కడ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించడం తదితర విషయాలను లోతుగా చర్చిస్తారు. ఈ సీరియస్ పాయింట్ కు కమర్షియల్ హంగులు అద్ది తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమా తర్వాత శర్వానంద్ పలు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాడు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం స్క్రిప్ట్ కు పచ్చ జెండా ఊపాడు కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ఇంచ్ కూడా ముందుకు కదల్లేదు. ఇదిలా ఉంటే శర్వానంద్ మరో సినిమాకు కమిట్ అయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ నటించనున్నాడు. సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాతో బిజీగా ఉంటే, కిషోర్ తిరుమల రామ్ తో రెడ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

ఇక శర్వానంద్ – కిషోర్ తిరుముల చేయబోయే చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జోడి ఇదివరకు పడి పడి లేచే మనసుకు కలిసి పనిచేసారు. ఆ సినిమా ప్లాపైనా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మరోసారి ఈ జోడి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All