రానా హీరోగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.
సమకాలీన అంశాల్ని స్పృశిస్తూనే వాస్తవిక పంథాలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సాయి పల్లవి జానపద కళాకారినిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల సాయి పల్లి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ సినిమాపై, సాయి పల్లవి పాత్రపై మరింతగా అంచనాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత ఈ చిత్ర నిర్మాత మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్నారట. ఈ సారి సోలోగా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కానున్నట్టు చెబుతున్నారు. అయితే ముందు ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మించనున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం వుందని తెలిసింది. హీరో నాని ప్రస్తుతం వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ్రాయ్ చిత్రాల్లో నటిస్తున్నారు.