రానా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. 1992లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నయాం గ్యాంగ్ నల్లగొండ జిల్లాలోని భువనగిరికి చెందిన బెల్లి లలితను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. విప్లవ గీతాలని ఆలపిస్తూ యువలో చైతన్యాన్ని రగిలిస్తున్న ఆమెని నయీం గ్యాంగ్ ముక్కలు ముక్కలుగా నరికి పార్ట్లని వేరు వేరు ప్రాంతాల్లో పడేశారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ అంశంతో పాటు ఉత్తర తెలంగాణలో 1992లో నక్సలిజం నేపథ్యంలో జరిగిన సంఘటనలి ఈ చిత్రంలో చూపించబోతున్నారట. సాయి పల్లవి పాత్ర గ్రామీణ యువతిగా సహజత్వానికి దగ్గరగా వుంటుందని తెలుస్తోంది. ఇందులో టబుని మానవ హక్కుల నేత పాత్ర కోసం తీసుకోవాలని ముందు దర్శకుడు ప్రయత్నించాడు. కానీ ఆమె అప్పటికే `అల వైకుంఠపురములో` చిత్రానికి కమిట్ కావడంతో ఆ స్థానంలో బాలీవుడ్ నటి నందితాదాస్ని తీసుకున్నారు.
తాజాగా ఆమెకు సంబంధించిన షూటింగ్ ఈ రోజే (మంగళవారం) మొదలైంది. దీంతో చిత్ర బృందం సెట్లో ఆమెకి సంబంధించిన ఫొటోలని మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా వుంటుందని, అందుకే ఆమెని ఈ పాత్ర కోసం వేణు ఊడుగుల తీసుకున్నారని వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.