బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్సింగ్ పేరుని జాతీయ మీడియా ప్రచారం చేయడంతో టాలీవుడ్లో ప్రకంపణలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఇదే కేసులో స్టార్ హీరో మహేష్ వైఫ్ నమ్రత పేరు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. మంగళవారం ఓ జాతీయ మీడియా ఎన్సీబీ అధికారులు టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారని ఈ విషయంపై అతనికి ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారంటూ జాతీయ మీడియాలో ఓ సంచలన కథనం ప్రసారం కావడం కలకలం రేపుతోంది.
టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. `బాంబేలో మంచి ఎండీ ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం పార్టీ చేసుకుందామని జయ సాహాతో చాటింగ్ చేసినట్టు సదరు జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడీ సంచలన కథనం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం తీగ లాగిఏ డొం కదిలిన చందంగా తయారై సంచలనం సృష్టిస్తోంది. విచారించినా కొద్దీ ఊహకందని సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి. రకుల్ ప్రీత్సింగ్ , సోహా అలీఖాన్, శ్రద్ధా కపూర్… ఆ తరువాత దీపికా పదుకునే వంటి వారి పేర్లు బయటికి వచ్చాయి. అయితే స్టార్ హీరో మహేష్ వైఫ్ నమ్రత పేరుని ఓ జాతీయ మీడియా ప్రస్తావించడం సంచలనంగా మారింది.