మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ట్విట్టర్ పంచ్లకు కొంత విరామం ఇచ్చినట్టున్నారు. ప్రతీ విషయంపై ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపక్గా మారిన నాగబాబు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. అయితే ఆయన చేస్తున్న విన్యాసాలు మాత్రం హాట్ టాపిక్గా మారుతున్నాయి. `జబర్దస్త్`కి పోటీగా `అదిరింది` అనే కామెడీ షో తో ఆకట్టుకుంటున్న ఆయన తాజాగా డేంజరస్ స్నేక్స్తో చేస్తున్న విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి.
కొండ చిలువని మెడలో వేసుకుని ఫొటోలకి పోజులిచ్చిన నాగబాబు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోబ్రా పక్క నుండగా తాపీగా చైర్లో కూర్చుని గాగుల్స్ పెట్టుకుని చిద్విలాసంతో చూస్తున్న మెగాబ్రదర్ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఉన్నట్టుండి నాగబాము ఈ విన్యాసాలు ఎందుకు చేసినట్టు అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది.
వైల్డ్ లైఫ్ సంరక్షణ, అవగాహనకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా నాగబాబు ఈ విన్యాసాలు చేశారట. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ కొండ చిలువని మెడలో వేసుకుని.. కోబ్రాతో ఫొటోలకు పోజులిచ్చారట. ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగబాబు ఓ సందేశాన్ని కూడా షేర్ చేశారు. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించడానికి సమానమైన హక్కు వుందని, అందుకే వాటిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం..అంటూ ట్వీట్ చేశారు.
View this post on Instagram