పవర్స్టార్ పవన్కల్యాణ్ ఊసరవెల్లి అంటూ విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం సృష్టిస్తున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్రాజ్ ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ హెచ్చరికలు ఆరీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జీ హెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్కల్యాణ్ ముందు తాము ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని ప్రకటించి ఆ తరువాత తమ అభ్యర్థులు పోటీకి దిగడం లేదని ప్రకటించడం విస్మయాన్ని కలిగించింది. ఇంతలోనే రెండు రకాలుగా పవన్ తన స్టాండ్ని మార్చుకోవడంతో షాక్కు గురైన నటుడు ప్రకాష్ రాజ్ జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మెగాబ్రదర్ ప్రకాష్రాజ్ పై నిప్పులు చెరగడంతో రాజకీయ వివాదం కాస్తా ఇండస్ట్రీ వివాదంగా మారింది.
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతూ వుంటాయి. అవి దీర్ఘకాలంలో పార్టీకి, ప్రజలకు మేలు చేస్తాయి. పవన్ తీసుకున్న బీజేపీతో పొత్తు నిర్ణయం కూడా అలాంటిదే అన్నారు నాగబాబు. ఇక ప్రకాష్రాజ్ గురించి మాట్లాడుతూ .. ఆయన మంచి గురించి మాట్లాడలేని కుసంస్కారి అని గతంలో చాలా మంది నిర్మాతలను డేట్స్ విషయంలో ఇబ్బందులకు గురిచేశాడని, సుబ్రహ్మణ్యస్వామితో జరిగిన డిబేట్లో నీళ్లు నమిలిన మేధావి అని ఘాటుగా విమర్శించారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.