అక్కినేని నాగచైతన్య సినిమాల పరంగా స్పీడు పెంచారు. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `లవ్స్టోరీ` చిత్రంలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోగాయిన్గా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే.
`మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. `థ్యాంక్యూ` పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. `13బి`తరహా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించబోతున్నారు.
నాగచైతన్య నటిస్తున్న తొలి థ్రిల్లర్ మూవీ ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగచైతన్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించనుందని తెలిసింది. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఇప్పటికే ఆమెని ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్కతున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన `గ్యాంగ్ లీడర్` చిత్రం ద్వారా ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే.