Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ ఫిల్మ్ న్యూ అప్‌డేట్‌!

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ ఫిల్మ్ న్యూ అప్‌డేట్‌!

ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ ఫిల్మ్ న్యూ అప్‌డేట్‌!
ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ ఫిల్మ్ న్యూ అప్‌డేట్‌!

నాగ్ అశ్విన్‌.. సైలెంట్‌గా వ‌చ్చి విమ‌ర్శ‌ల‌కు విస్మ‌యానికి గురిచేసిన ద‌ర్శ‌కుడు. అసాధ్యం అనుకున్న సావిత్రి బ‌యోపిక్‌ని వెండితెర‌పై దృశ్య‌మానం చేసి `మ‌హాన‌టి`కి నీరాజ‌నాలు ప‌లికారు. న‌ట‌నే రాద‌ని విమ‌ర్శించిన కీర్తిసురేష్‌ని సావిత్రి పాత్రకు ఎంచుకుని ఆమె చేత అవాక్క‌య్యే అద్వితీయ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నారు. రెండ‌వ చిత్రానికే జాతీయ అవార్డుని ద‌క్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు.

`మ‌హాన‌టి` చిత్రంతో యావ‌త్ ఇండస్ట్రీని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన నాగ్ అశ్విన్ త‌న నెక్స్ట్ ఫిల్మ్‌ని ఎవ‌రితో చేయోతున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌భాస్‌తో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ నిర్మించ‌నున్నారు. ఈ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ న‌డుస్తున్న నేప‌థ్యంలో స‌మ‌యం చిక్క‌డంతో నాగ్ అశ్విన్ ఈ చిత్ర క‌థ‌ని పూర్తి చేశార‌ట‌. ప్ర‌భాస్‌కి లైన్ మాత్ర‌మే చెప్పి ప్రాజెక్ట్‌ని ఓకే చేయించుకున్న అశ్విన్ లాక్‌డౌన్ త‌రువాత పూర్తి స్థాయిలో చిత్ర క‌థ‌ని వినిపించ‌బోతున్నార‌ట‌. వ‌న్స్ స్టోరీ సిట్టింగ్స్ పూర్త‌యిన త‌రువాత ప‌రిస్థితుల‌ని బ‌ట్టి షెడ్యూల్ ప్లాన్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు. కొంత షూటింగ్ బ్యాలెన్స్‌గా వుంది. అది పూర్త‌యిన త‌రువాతే నాగ్ అశ్విన్‌కు డేట్స్ కేటాయించున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All