దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంక్ష గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ని మే 3 వరకు పొడిగిస్తే తెలంగాణలో దాన్ని మే 7 వరకు పొడిగించారు. మే 8న లాక్ డౌన్ ఎత్తేస్తారని అంటున్నారు కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
దీంతో మే 8 కోసం ఎదురుచూస్తున్న సినీ వర్గాలకు నిరాశ తప్పేలా లేదు. ఒక వేళ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడి మే 8న లాఖ్ డౌన్ ఎత్తేసినా ఆ వెంటనే సినిమా షూటింగ్లకి కానీ థియేటర్లు ఓపెన్ చేయడానికి గానీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మాత్రం వచ్చేలా కనిపించడం లేదు. మార్చి మూడవ వారం నుంచి థియేటర్ల బంద్ మొదలైంది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నారు.
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని థియేటర్లు తెరవాలన్నా, మళ్లీ యధావిధిగా సినిమా షూటింగ్లు ప్రారంభించాలన్నా జూన్ వరకు ఎదురుచూడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ విషయంలో క్లారిటీ వస్తేనే చిరంజీవి ఆచార్య, ప్రభాస్ జాన్, పవన్కల్యాణ్ `వకీల్ సాబ్, రాజమౌళి `ఆర్ఆర్ఆర్ చిత్రాలు షూటింగ్లు మొదలవుతాయని చెబుతున్నారు.