ప్రపంచానికి ఎం ఉపద్రవం రాబోతోంది? .. ఒకదాని వెంట ఒకటి ప్రకృతి వైపరీత్యాలు .. ప్రమాదాలు విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. కొరోనా కారణంగా యావత్ ప్రపంచం భయంగుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఏ దేశం గురించి విన్నా కరోనా అక్రన్దనలే . కరోనా మరణాలే. ప్రస్తుతం భారత్ లో కరోనా విజృంభిస్తోంది.
దీనికి తోడు మిడతల దండు భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎక్కడి నుంచి ఎలా మిడతల దండు దాడి చేస్తుందో అని జనం, ప్రభుత్వ యంత్రాంగం భయంతో గడుపుతున్నారు. ఇదే అదనుగా చైనా ఓపక్క.. పాకిస్థాన్ ఓపక్క దేశంపై దొంగ దాడి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే రాజస్థాన్ ఎడారిలో ఉల్కా పడటం సంచలనంగా మారింది. 2.8 కేజీల ఉల్క రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో పడినట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. శుక్రవారం ఉదయం జలోర్ జిల్లాలో ఉల్క పడినట్టు గుర్తించారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉన్నట్టుండి అన్ని ఉపద్రవాలు ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడం ఎదో జరగబోతోందనే చెడు సుసంకేతాల్ని అందిస్తున్నాయని అంతా భావిస్తున్నారు.
- Advertisement -