Homeటాప్ స్టోరీస్పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా 'మహేష్ బాబు' మాత్రమే కావాలంటా...

పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా ‘మహేష్ బాబు’ మాత్రమే కావాలంటా…

పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా 'మహేష్ బాబు' మాత్రమే కావాలంటా...
పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా ‘మహేష్ బాబు’ మాత్రమే కావాలంటా…

మనకి నచ్చిన నటీనటుల ని జీవితంలో ఒక్కసారి అయిన కలవాలి, వారితో కలిసి ఫోటో దిగాలి వారి సంతకాన్ని తీసుకోవాలి అని అందరం అనుకుంటాము. దానికోసం చాల కష్ట పడుతాం…..కొన్ని స్వచ్చంద సంస్థలు ‘మేక్ ఏ విష్’ అంటూ చేపట్టిన కార్యక్రమాలు కూడా చూసాం. కానీ ఇప్పుడు నేను చెప్పే సంఘటన వింటే నిజంగానే ఆశ్యర్యపోతారు. ఆ సంఘటన మహేష్ బాబు కోసం జరిగింది, అలా చేసింది ఒక మహిళ.

విజయవాడ లోని ఒక మహిళ చెట్టు ఎక్కి “ఇక్కడికి వెంటనే మహేష్ బాబు గారు రావాలి నా సమస్యకి పరిష్కారం మహేష్ బాబు గారు ఒక్కరే” అని ఆ ఏరియా ని ఒక్కసారిగా బయపెట్టేసింది. అలా చేసిందంటే మనం ఏమనుకుంటాము? సరేలే మహేష్ బాబు గారి మీద, ఆయన సినిమాల మీద ఇష్టం ఎక్కువ ఉందేమో? ఇలా చేయడం తప్పు అని కొంతమంది నచ్చ చెప్పారు. కానీ ఆమె అస్సలు వారి మాట వినలేదు. కిందకి దిగమని అడిగారు, నేను దిగాను అన్నది. వింతగా,భలేగా ఉన్నది ఈ అమ్మాయి అని చెప్పి ఫోటో, వీడియో తీస్తుంటే చెట్టు కొమ్మలు ఇరగొట్టి వారి మీద విసిరేసింది.

- Advertisement -

కొంత సమయం తరువాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే…..”మహేష్ బాబు గారు రావాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడాలి…అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నా బాధ అర్ధం చేసుకోవాలి” అంటూ పోలీసుల ముందు గట్టిగా అరిచింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు నెమ్మదిగా చెట్టు ఎక్కి కిందకి దింపాలి అనుకున్నారు. అప్పటికి ఆ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువయింది. చెట్టు నుంచి నేను దిగను అని ఆ మహిళ మొరాయించింది పొలుసులతో.

ఇక పోలీసులు వెనక నుండి చెట్టుకి నిచ్చెన వేసి ఆ మహిళ ని కిందకి దింపేసారు. విజయవాడ లోని రెవిన్యూ కాలనీ అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదురుగ్గా ఆ చెట్టు ఉంది. ఇక పోలీసులు ఆ మహిళ ఎందుకు ఇలా చేసింది? అని ఆరా తీస్తే ఆ మహిళ కోల్ కత్తా నుండి విజయవాడ కి వలస వచ్చిందని, తనని డబ్బులు మిగిలిన సమస్యల విషయంలో మోసం చేసారని అందుకే మతి స్థిమితం కోల్పోయి ఇలా చేసిందని విచారణలో తేలింది.

ఇక జనాలు కూడా ఆమె అలా చేసే సరికి మొదట మహేష్ బాబూ గారు వస్తారు అని మహేష్ బాబు అంటే మాకు కూడా ఇష్టం అని….ఆతృతగా ఎదురుచూస్తున్న జనాలకు చివరకు ఆ మహిళకి పిచ్చి పట్టి ఇలా చేస్తుంది అని తెలిసి వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మొత్తానికి మహేష్ బాబు అనేసరికి అందరికి ఉస్తాహం వచ్చింది. అందరికి ఆయన్ని చూడాలని ఉంటుంది కదా అనుకున్నారు జనాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All