కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. `ఆచార్య` సెట్కి వెళ్లిన మోహన్బాబు బోకే అందజేసి తన చిరకాల మిత్రుడు చిరంజీవిని ఆశ్చర్యపరిచాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన మెగాస్టార్ మోహన్బాబుని `ఆచార్య` సెట్లోకి సాదరంగా ఆహ్వానించి కొంత సమయం గడిపిన విషయం తెలిసిందే.
మంచు విష్ణు కలిసిన వెంటనే మోహన్బాబు మెగాస్టార్ని ప్రత్యేకంగా కలవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చిరుని మోగాహన్బాబు కలవడం వెనక ప్రధాన కారణం వుందని చెబుతున్నారు. ప్రస్తుతం మోహన్బాబు `సన్ ఆఫ్ ఇండియా` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర పరిచయం కోసం మెగాస్టార్ని వాయిస్ ఓవర్ అందించమని మోహన్బాబు అడిగారట.
ఇందుకు మెగాస్టార్ కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నట్టు తెలిసింది. సమ కాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో దేశ భక్తి ప్రధానంగా `సన్ ఆఫ్ ఇండియా` చిత్రాన్ని డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మంచు విష్ణు నిర్మిస్తున్నారు.