మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుంతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కొణిదెల ప్రొడక్షన్ హౌస్తో కలిసి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆలయ ట్రస్ట్ భూముల కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరు డైలాగ్స్, మణిశర్మ నేపథ్య సంగీతం.. టెంపుల్ టౌన్ సెట్స్ లో తీసిని హైఓల్టేజ్ సన్నివేశాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
అయితే మణిశర్మ మ్యూజిక్ విషయంలో మాత్రం చిరు అసంతృప్తితో వున్నారట. అనుకున్న స్థాయిలో మ్యూజిక్ లేదని ఫీలవుతున్నారట. ఆ కారణంగానే తను బాబీతో చేయబోతున్న చిత్రానికి దేవి శ్రీప్రసాద్ని తీసుకోవాలని చిరు ఫిక్సయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.