Homeటాప్ స్టోరీస్సెట్లో మెగాస్టార్ సంద‌డి షురూ!

సెట్లో మెగాస్టార్ సంద‌డి షురూ!

సెట్లో మెగాస్టార్ సంద‌డి షురూ!
సెట్లో మెగాస్టార్ సంద‌డి షురూ!

మెగాస్టార్ చిరంజీవి ఎట్ట‌కేల‌కు సెట్లో అడుగు పెట్టారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ్యాట్నీ మూవీస్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి నిరంజ‌న్‌రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ గ‌త ఎనిమిది నెల‌లు లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయింది.

ఇటీవ‌ల స్టార్ హీరోల సినిమాల‌న్నీ పునః ప్రారంభం కావ‌డంతో మెగాస్టార్ మూవీ `ఆచార్య‌` కూడా ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా భావించారు కానీ చిరుకు క‌రోనా అంటూ నిర్ధార‌ణ కావ‌డం.. ఆయ‌న క్వారెంటైన్‌కి వెళ్లిపోవ‌డంతో ఈ నెల 9న ప్రారంభం కావాల్సిన `ఆచార్య‌` షూటింగ్ మ‌ళ్లీ సందిగ్ధంలో ప‌డిపోయింది. ఆ త‌రువాత చిరుకు అనుమానం వ‌చ్చి మ‌రోసారి టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని రావ‌డంతో చిరు `ఆచార్య‌` షూట్‌కు రెడీ అయ్యారు.

- Advertisement -

తాజాగా చిరు `ఆచార్య‌` సెట్‌లో సంద‌డి చేయ‌డం షురూ చేసిన‌ట్టు తెలిసింది. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట‌లో ఈ మూవీ కోసం ప్ర‌త్యేకంగా ఓ కాల‌నీ సెట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో చిరు పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. చిరుతో పాటు రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All