తిరుపతిలో భారీ వర్షాల వల్ల తిరుమల కొండ మీద భక్తులతో పాటుగా తిరుపతిలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొండ మీద ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా తిరుపతి భారీ వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు వహిస్తుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో వర్షాల వల్ల ప్రజలు, స్థానికులు ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, టీటీడీ కలిసి త్వరగా అక్కడ సాధారణ పరిస్థితి తీసుకురావాలని కోరారు. రాజకీయ పక్షాలు సైతం అందుకు పనిచేయాలని అన్నారు.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన సంఘాలను కూడా తగిన సాయాన్ని అందిచాలని కోరారు. సినీ పరిశ్రమకే కాదు ఏపీ, తెలంగాణాలో ఎలాంటి విపత్తు వచ్చినా సినీ పరిశ్రమ నుండి ముందు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి భారీ వర్షాల వల్ల అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం, టీటీడీ మెంబర్స్ త్వరగా వారికి సాయం చేయాలని కోరారు.
#RainFuryInTirupathi
Appeal to State Government, TTD,All Political Parties, Fans Associations & Good Samaritans to extend all possible help to restore normalcy asap. pic.twitter.com/XugKJsh1Z6— Chiranjeevi Konidela (@KChiruTweets) November 19, 2021