ప్రామిసింగ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మైహోమ్ గ్రూప్తో కలిసి `ఆహా` ఓటీటీని నిర్వమిస్తున్న విషయం తెలిసిందే. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్కు మరింత క్రేజ్ని తీసుకొచ్చే క్రమంలో రియాలిటీ షోలని కూడా ప్లాన్ చేసిన అల్లు అరవింద్ `సామ్ జామ్` పేరుతో సమంత హోస్ట్గా టాక్ షోని ప్రారంభించారు. తొలి ఎపిసోడ్ని సెన్సెషన్నల్ స్టార్ విజయ్ దేవరకొండతో పూర్తి చేశారు.
ఇప్పటికే ఈ ఓటీటీ కోసం వెబ్ సిరీస్లు, మూవీస్ ఓ రేంజ్లో క్యూ కట్టాయి. అయితే దీనికి మించి వినోదాన్ని ఎగ్జైట్మెంట్ని వీవర్స్కి అందించాలనే ఆలోచనలో భాగంగా `సామ్ జామ్` టాక్ షోని ప్లాన్ చేశారు. తాజాగా ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది.
దీనికి సంబంధించిన ఫొటోల్ని ఆహా టీమ్ తాజాగా బయటికి వదిలింది. ఈ ఫొటోల్లో చిరు మరింత స్లిమ్గా మారి యంగ్ హీరోలా కనిపిస్తుండంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నెల 13 న ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేశారు. త్వరలో మెగాస్టార్కు సంబంధించిన ఎపిసోడ్ని రిలీజ్ ఏయబోతున్నారు. మొత్తం 10 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ షో `ఆహా`కు రికార్డు స్థాయి వీక్షకుల్ని పెంచుతుందో చూడాలి.